సుప్రీంలో పిటిషన్‌‌ను ఉపసంహరించుకున్న కేంద్రం

ABN , First Publish Date - 2021-01-20T20:55:27+05:30 IST

రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి ఇవ్వవద్దంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ..

సుప్రీంలో పిటిషన్‌‌ను ఉపసంహరించుకున్న కేంద్రం

న్యూఢిల్లీ: రిపబ్లిక్ దినోత్సవం నాడు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి ఇవ్వవద్దంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ ర్యాలీపై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయమని, అనుమతి ఇవ్వాలా వద్దా అనేది పోలీసులే నిర్ణయించుకోవాలని అత్యున్నత ధర్మాసనం పిటిషన్ల విచారణ అనంతరం బుధవారంనాడు స్పష్టం చేసింది. ఇది 'పోలీసుల వ్యవహారం' అని కేంద్రానికి స్పష్టం చేసింది.


'మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వదలచుకోలేదని మీకు చెప్పదలచుకున్నాం. ఇది పూర్తిగా పోలీస్ మేటర్. మీరుపిటిషన్ ఉపంసహరించుకునేందుకు కూడా అనుమతి ఇస్తున్నాం. మీకు అధికారం ఉంది, ఆ వ్యవహారాన్ని మీరే చూసుకోండి. ఉత్తర్వులు జారీ చేసే అధికారం మీకు ఉంది, అలా చేయవచ్చు. దీనిపై ఆదేశాలివ్వాల్సింది కోర్టు కాదు' అని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఢిల్లీ పోలీసుల ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్రం ఉపసంహరించుకుంది.

Updated Date - 2021-01-20T20:55:27+05:30 IST