ఎంపీ ముకుల్ రాయ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ తొలగింపు

ABN , First Publish Date - 2021-06-17T17:28:24+05:30 IST

బీజేపీ ఎంపీ ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అతనికి కేంద్రం కేటాయించిన జడ్ కేటగిరి సెక్యూరిటీని...

ఎంపీ ముకుల్ రాయ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ తొలగింపు

న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అతనికి  కేంద్రం కేటాయించిన జడ్ కేటగిరి సెక్యూరిటీని తొలగించింది. ఎంపీ ముకుల్ రాయ్ టీఎంసీలో చేరికతో పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. బీజేపీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ముకుల్ రాయ్ కు కేంద్రం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జడ్ కేటగిరి భద్రత కల్పించింది. మళ్లీ తిరిగి టీఎంసీలో చేరడంతో కేంద్రం కల్పించిన భద్రతను ఉపసంహరించుకుంది. తనకు కల్పించిన జడ్ కేటగిరి భద్రతను తొలగించాలని ఎంపీ ముకుల్ రాయ్ కేంద్రహోంమంత్రిత్వశాఖకు లేఖ రాసిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్య తీసుకుంది.


Updated Date - 2021-06-17T17:28:24+05:30 IST