హుజురాబాద్ ఉపఎన్నికపై సీఈవో సమీక్ష
ABN , First Publish Date - 2021-10-28T00:29:47+05:30 IST
హుజురాబాద్ ఉపఎన్నిక ఏర్పాట్లపై కరీంనగర్, హన్మకొండ కలెక్టర్లు,
హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నిక ఏర్పాట్లపై కరీంనగర్, హన్మకొండ కలెక్టర్లు, సీపీలతో సీఈవో శశాంక్ గోయల్ సమావేశం నిర్వహించారు. కొవిడ్ మార్గదర్శకాలు అమలు చేస్తూ ఎన్నికల నియమావళి కఠినంగా అమలు చేయాలని అధికారులను సీఈవో ఆదేశించారు. అన్ని ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మోహరించాలని సూచించారు. నియోజకవర్గంలో నగదు, మద్యం పంపిణీని అరికట్టాలన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఈవో ఆదేశించారు. ఏమైనా ఘటనలు జరిగితే వెంటనే కలెక్టర్కు నివేదించాలని సీఈవో శశాంక్ పేర్కొన్నారు.