చాక్లెట్లలో పురుగులు
ABN , First Publish Date - 2022-01-20T05:02:15+05:30 IST
ఓ చిన్నారి తన పుట్టినరోజు సందర్భంగా కొనుగోలు చేసిన చాక్లెట్లలో పురుగులుండటంతో బాలిక తండ్రి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కోవూరు, జనవరి 19: ఓ చిన్నారి తన పుట్టినరోజు సందర్భంగా కొనుగోలు చేసిన చాక్లెట్లలో పురుగులుండటంతో బాలిక తండ్రి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు.. కోవూరు పట్టణానికి చెందిన టీడీపీ బీసీసెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పంది రఘురామ్ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా బుధవారం పట్టణంలోని ఓ దుకాణంలో ‘స్టేసీ’ కంపెనీ చాక్లెట్ల ప్యాకెట్ కొనుగోలు చేశారు. ఆ చాక్లెట్లను పాఠశాలలో, చుట్టుపక్కల నివాసమున్న బాలలకు పంపిణీ చేశారు. చాలా చాక్లెట్లలో సన్నటి పురుగులుండటంతో చిన్నారులు ఖంగుతిన్నారు. కొంతమంది పురుగులను చూసి చాక్లెట్లను పడేశారు. మరికొందరు చూసుకోకుండా తినేశారు. వెంటనే బాలిక తండ్రి రఘురామ్ దుకాణం యజమానిని కలిసి ప్రశ్నించారు. తానేమీ చేయలేనని చాక్లెట్ల తయారీ మల్టినేషన్ కంపెనీ అని సమాధానమిచ్చారు. దీంతో ఆయన ‘స్టేసీ’ కంపెనీపై, దుకాణం యజమానిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.