BJP, TRSలు డబుల్ గేమ్ ఆడుతున్నాయ్: chada

ABN , First Publish Date - 2021-09-08T18:05:59+05:30 IST

బీజేపీ, టీఆర్ఎస్‌లు డబుల్ గేమ్ ఆడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సంగ్రామ యాత్ర కాదు..

BJP, TRSలు డబుల్ గేమ్ ఆడుతున్నాయ్: chada

హైదరాబాద్: బీజేపీ, టీఆర్ఎస్‌లు డబుల్ గేమ్ ఆడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సంగ్రామ యాత్ర కాదు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా దగా యాత్ర చేస్తున్నాడని‌ ధ్వజమెత్తారు. బండి పాదయాత్రలో పస లేదని... ఆయనను అసలు ప్రజలు గుర్తించటం‌ లేదని చాడా పేర్కొన్నారు. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని కేంద్రం గుర్తించిన తర్వాతనే అమిత్ షా తెలంగాణలో పర్యటించాలన్నారు. బీజేపీతో కేసీఆర్.. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి కేసీఆర్ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఎంఐఎంతో దోస్తీ కారణంగానే కేసీఆర్ సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించటం లేదన్నారు. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవానికి బీజేపీ మతం రంగు పులుముతోందన్నారు. తెలంగాణ సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుంచి 17 వరకూ సాయుధ అమరులకు నివాళి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2021-09-08T18:05:59+05:30 IST