నగరంలో చైన్ స్నాచర్ హల్‌చల్

ABN , First Publish Date - 2022-01-20T02:07:09+05:30 IST

నగరంతో పాటు మేడ్చల్ జిల్లాలో చైన్ స్నాచర్లు

నగరంలో చైన్ స్నాచర్ హల్‌చల్

హైదరాబాద్: నగరంతో పాటు మేడ్చల్ జిల్లాలో చైన్ స్నాచర్లు హల్‌చల్ చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి బొడుప్పల్‌లోని లక్ష్మీనగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగింది. కట్ట అంజమ్మ(50) అనే గృహిణి వాకింగ్ చేస్తుండగా మెడలో నుంచి ఐదు తులాల బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లాడు. సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పేట్ బషీరబాద్, తుకారాం గేట్, మారెడ్‌పల్లిలో గొలుసు దొంగ తనాలు చేసిన వ్యక్తి, బొడుప్పల్‌లో చేసిన వ్యక్తి ఒకటే దుండగుడు అని పోలీసులు తేల్చారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


మారేడుపల్లిలోని రైల్వే కాలనీలో.. 


హైదరాబాద్: నగరంలోని మారేడుపల్లిలోని రైల్వే కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగిన విషయం తెలిసిందే. విజయలక్ష్మి  అనే మహిళ మెడలోంచి 4 తులాల బంగారు గొలుసు స్నాచర్ ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసుకుని మారేడుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పేట్ బషీర్‌బాద్ పీఎస్ పరిధిలోని సుచిత్ర రాఘవేంద్ర కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి బైక్‌పై వచ్చి 2.5 తులాల బంగారు చైన్‌ను దుండగుడు దోచుకెళ్లాడు.  


Updated Date - 2022-01-20T02:07:09+05:30 IST