భూత్పూర్‌ గ్రంథాలయాన్ని పరిశీలించిన చైర్మన్‌

ABN , First Publish Date - 2021-10-22T05:47:00+05:30 IST

భూత్పూర్‌ గ్రంథా లయాన్ని జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు.

భూత్పూర్‌ గ్రంథాలయాన్ని పరిశీలించిన చైర్మన్‌
గ్రంథాలయాన్ని పరిశీలిస్తున్న చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌

భూత్పూర్‌, అక్టోబరు 21 : భూత్పూర్‌ గ్రంథా లయాన్ని జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా గ్రం థాలయానికి ఎంత మం ది పాఠకులు వస్తున్నా రు, వారికి ఎలాంటి సదు పాయాలు ఉన్నాయి వంటి విషయాలను స్థాని క లైబ్రేరియన్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయానికి కాంపౌండ్‌ వాలు లేదని, అదే విధంగా టాయిలెట్‌ సదుపాయం లేదని పాఠకులు చైర్మన్‌ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన చైర్మన్‌ రాజేశ్వ ర్‌గౌడ్‌ కాంపాండ్‌వాలు, టాయిలెట్‌ త్వరలో మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మనోజ్‌కుమార్‌, స్థానిక లైబ్రేరియన్‌ మాధవీలత, సిబ్బంది అంజి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T05:47:00+05:30 IST