కంకిపాడులోని చైతన్య కాలేజీ దగ్గర ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-08-06T20:54:38+05:30 IST
కంకిపాడులోని చైతన్య కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ పిల్లలకు టీసీ ఇవ్వాలంటూ తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు.
కృష్ణా: కంకిపాడులోని చైతన్య కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ పిల్లలకు టీసీ ఇవ్వాలంటూ తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. గోశాల చైతన్య క్యాంపస్లో బైపీసీ ఫస్టియర్ పూర్తిచేసిన విద్యార్థులు.. సెకండియర్ మరో కాలేజీలో చేరేందుకు విద్యార్థులు టీసీ అడుగుతున్నారు. సెకండియర్ ఫీజ్ చెల్లిస్తేనే టీసీ ఇస్తామంటున్న కాలేజీ యాజమాన్యం చెబుతోంది. యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీసీ ఇవ్వాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు తల్లిదండ్రులు వెళ్లినట్లు తెలుస్తోంది.