నాసా కాంటె స్టుకు శ్రీ చైతన్య విద్యార్థుల ఎంపిక
ABN , First Publish Date - 2021-12-09T05:54:32+05:30 IST
నాసా కాంటెస్టు 2022కు సంబంఽధించి మూడు ప్రాజెక్టులను తయారు చేయడానికి భవానీ పురంలోని శ్రీ చైతన్య విద్యార్థులు ఎంపిక య్యారు. ఈ విద్యార్థులు అంత రిక్షంలో స్పేస్కాలనీ, స్పేస్ వాటర్, స్పేస్ రెస్టారెంట్ మూడు ప్రాజెక్టులను సిద్ధం చేసి అమెరికాకు పంపుతారు
నాసా కాంటె స్టుకు శ్రీ చైతన్య విద్యార్థుల ఎంపిక
భవానీపురం, డిసెంబరు 8 : నాసా కాంటెస్టు 2022కు సంబంఽధించి మూడు ప్రాజెక్టులను తయారు చేయడానికి భవానీ పురంలోని శ్రీ చైతన్య విద్యార్థులు ఎంపిక య్యారు. ఈ విద్యార్థులు అంత రిక్షంలో స్పేస్కాలనీ, స్పేస్ వాటర్, స్పేస్ రెస్టారెంట్ మూడు ప్రాజెక్టులను సిద్ధం చేసి అమెరికాకు పంపుతారు. విద్యార్థులకు అభినందన సభ బుధవారం స్కూల్లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రేవూరి సర్వేశ్వరప్రసాద్ మాట్లాడుతూ చైతన్య పాఠశాలలు విద్యావిధానాన్ని వ్యక్తిగత శ్రద్ధను కొనియాడారు. పాఠశాల ఏజీఎం మురళీకృష్ణ, వి. రామారావులు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. ప్రిన్సిపాల్ సత్యజిత్ర, డీన్ రంగారావు, ‘సి’ బ్యాచ్ ఇన్చార్జి రాకేష్ వినయ్, ఉపాఽధ్యాయులు పాల్గొన్నారు.