మన్యంలో పెరిగిన చలి
ABN , First Publish Date - 2020-12-03T06:21:26+05:30 IST
ఉత్తరాది నుంచి శీతలగాలులు వీస్తుండడంతో మన్యంలో చలి తీవ్రత మరింత పెరిగింది.
దట్టంగా కురుస్తున్న మంచు
చింతపల్లి/ సీలేరు: ఉత్తరాది నుంచి శీతలగాలులు వీస్తుండడంతో మన్యంలో చలి తీవ్రత మరింత పెరిగింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు విపరీతంగా కురిసింది. చింతపల్లిలో 11.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సీలేరు సందర్శనకు వచ్చిన పర్యాటకులు ఉదయాన్నే గుంటవాడ జలాశయం, చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి, ప్రకృతి అందాలను ఆస్వాదించారు.