చలో పత్తికొండ ఉద్రిక్తం
ABN , First Publish Date - 2020-09-25T08:13:50+05:30 IST
కర్నూలు జిల్లా పత్తికొండలో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసమైన ఘటనను నిరసిస్తూ బీజేపీ, జనసేన
పత్తికొండ, సెప్టెంబరు 24: కర్నూలు జిల్లా పత్తికొండలో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసమైన ఘటనను నిరసిస్తూ బీజేపీ, జనసేన గురువారం చేపట్టిన చలో పత్తికొండ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకు సిద్ధమవుతున్న జనసేన నాయకులను, బీజేపీనేత రంగాగౌడ్ నాయకత్వంలోని ర్యాలీని పోలీసులు అడ్డుకొన్నారు.
కాగా, తూర్పుగోదావరి జిల్లా మండపేటలో యేసుక్రీస్తు, మేరీమాత విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.