విజయవాడ ‘సింహగర్జన’కు తరలివెళ్లాలి
ABN , First Publish Date - 2021-12-08T05:40:06+05:30 IST
సీపీఎస్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న సింహగర్జనకు ఉద్యోగులు తరలి వెళ్లాలని ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చింతపల్లి డివిజన్ నాయకుడు కుడుముల వెంకట రమణ పిలుపునిచ్చారు.
ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు
చింతపల్లి, డిసెంబరు 7: సీపీఎస్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న సింహగర్జనకు ఉద్యోగులు తరలి వెళ్లాలని ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చింతపల్లి డివిజన్ నాయకుడు కుడుముల వెంకట రమణ పిలుపునిచ్చారు. మంగళవారం ఇక్కడ సింహగర్జన పోస్టర్లను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పింఛన్ అమలుచేస్తామని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేఇ రెండున్నరేళ్లు దాటినా అమలు చేయలేదని అన్నారు. గిరిజన ప్రాంతానికి చెందిన వివిధ శాఖల ఉద్యోగులు సింహగర్జనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.