చందానగర్ కౌంటింగ్ కేంద్రంలో జర్నలిస్టుల నిరసన
ABN , First Publish Date - 2020-12-04T16:00:19+05:30 IST
చందానగర్ కౌంటింగ్ కేంద్రంలో జర్నలిస్టుల నిరసనకు దిగారు.
సంగారెడ్డి: చందానగర్ కౌంటింగ్ కేంద్రంలో జర్నలిస్టుల నిరసనకు దిగారు. కౌంటింగ్కు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఇవ్వడం లేదుంటూ ఆందోళన చేపట్టారు. జీహెచ్ఎంసీ కమీషనర్, డిప్యూటీ కమిషనర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు జర్నలిస్టులు యత్నించగా... మీడియాకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.