ఎమ్మెల్యే వసంత ప్రోద్బలంతోనే ఉమపై దాడి: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-07-28T03:01:44+05:30 IST

కొండపల్లి ఫారెస్టులో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రోద్బలంతోనే టీడీపీ నాయకుడు దేవినేని

ఎమ్మెల్యే వసంత ప్రోద్బలంతోనే ఉమపై దాడి: చంద్రబాబు

విజయవాడ: కొండపల్లి ఫారెస్టులో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రోద్బలంతోనే టీడీపీ నాయకుడు దేవినేని ఉమపై దాడి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఉమ కారుపై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అవినీతి,అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజా సంపదను  వైసీపీ నేతలు దోచుకుంటుంటే ప్రజల తరపున తెలుగుదేశం నేతలు అడ్డుకోవడం తప్పా అని చంద్రబాబు నిలదీశారు. మైనింగ్‌ను అడ్డుకుంటే హత్యాయత్నాలు, బెదిరింపులకు పాల్పడుతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరిపై 100 మంది వైసీపీ గూండాల దాడి పిరికిపింద చర్యఅని అన్నారు. 

Updated Date - 2021-07-28T03:01:44+05:30 IST