చంద్రబాబుతోనే రాష్ర్టాభివృద్ధి

ABN , First Publish Date - 2022-01-24T05:19:11+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.

చంద్రబాబుతోనే రాష్ర్టాభివృద్ధి
రక్తదాన శిబిరంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

రక్తదాన శిబిరంలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి

ఘనంగా లోకేష్‌ జన్మదినం


కొడవలూరు, జనవరి 23: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతోనే  రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మండల పరిధిలోని నార్తురాజుపాళెం పీఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదినం సందర్భంగా ఆదివారం రక్తదానం శిబిరం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి ముఖ్యఅతిఽథిగా పాల్గొని, మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయన్నారు. తిరిగి రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నామన్నారు. అనంతరం తెలుగు యువత రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్‌ జన్మదినం  సందర్భంగా రక్తదానం చేసేందుకు పెద్దసంఖ్యలో యువకులు, పార్టీ నాయకులు కదలి రావడం అభినందనీయమన్నారు. శిబిరంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, చక్కా మదన్‌, చెముకుల కృష్ణచైతన్య, కరకటి మల్లికార్జున, జొన్నా శివకుమార్‌, గరికిపాటి రాజేంద్రకుమార్‌, కేతు వెంకట రమణారెడ్డి, నాశిన ప్రసాద్‌, వీరేంద్ర చౌదరి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

 

టీడీపీ విజయానికి వారధిలా నిలవండి

వెంకటాచలం : రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి యువత వారధిలా నిలిచి, కలిసికట్టుగా పని చేయాలని టీడీపీ మండలాధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్‌ పిలుపునిచ్చారు. వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుయువత మండలాధ్యక్షుడు కందిమళ్ల సతీష్‌ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిత్యం పోరాటాలు చేస్తున్న నారా లోకేష్‌కు మద్దతుగా నిలిచి, ఆయన పోరాట పటిమను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్దామన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వల్లూరు రమేష్‌నాయుడు, నాయకులు వెంకటకృష్ణనాయుడు, మల్లికార్జున్‌రెడ్డి, సత్తార్‌ సాహెబ్‌, సండి రమేష్‌, అదూరు అమర్నాథ్‌, రమణయ్య, జలీల్‌, వెంకట్రాది, పవన్‌కుమార్‌ తదితరులున్నారు.  


పొదలకూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదినం వేడుకలు తెలుగు యువత ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా జరిగాయి. టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున్‌నాయుడు, దేవినేని శరత్‌బాబు కేక్‌ కట్‌ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ, తెలుగు యువత నాయకులు సుందరరామిరెడ్డి,  సుధాకర్‌ రెడ్డి, సాధం గిరీష్‌, ఓబుల్‌రెడ్డి, వెంకటరమణయ్య, నారపనాయుడు, సుబ్బానాయుడు, వెంకటేష్‌, ప్రభాకర్‌, మస్తాన్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

బుచ్చిరెడ్డిపాళెం : మండలంలోని విలియమ్స్‌పేటలోని శ్రీకృష్ణ వృద్ధాశ్రమంలో కొత్త వంగల్లు టీడీపీ నెల్లూరు పార్లమెంటరీ కార్యదర్శి చెక్కా మదన్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను వృద్ధుల  నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు పంపిణీ చేశారు.కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కేతు వెంకటరామిరెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T05:19:11+05:30 IST