అప్పుడు పొలవరం పనులు 72 శాతం పూర్తయ్యాయి: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-11-22T19:53:39+05:30 IST

అప్పుడు పొలవరం పనులు 72 శాతం పూర్తయ్యాయి: చంద్రబాబు

అప్పుడు పొలవరం పనులు 72 శాతం పూర్తయ్యాయి: చంద్రబాబు

విజయవాడ: సీపీఐ నాయకుల నిర్భంధాలను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. అక్రమ నిర్భంధం నుంచి సీపీఐ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వచ్చేవారిని అనుమతించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అణచివేత వైఖరి గర్హనీయమన్నారు. వైసీపీ అప్రజాస్వామిక పోకడలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు 72 శాతం పూర్తయ్యాయని చంద్రబాబు గుర్తుచేశారు. వైసీపీ వచ్చాక పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి బయటపడుతుందనే ప్రతిపక్షాలపై అణచివేత ధోరణి కనబరుస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - 2020-11-22T19:53:39+05:30 IST