విశాఖలో రెండోరోజు చంద్రబాబు ఎన్నికల ప్రచారం

ABN , First Publish Date - 2021-03-06T15:55:20+05:30 IST

జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు శనివారం విశాఖలో రోడ్ షోలు..

విశాఖలో రెండోరోజు చంద్రబాబు ఎన్నికల ప్రచారం

విశాఖ: జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండోరోజు శనివారం  గాజువాక, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణం, భీమిలి నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు.


కాగా శుక్రవారం సాయంత్రం చంద్రబాబు పెందుర్తిలో రోడ్‌ షో నిర్వహించారు. పెందుర్తి, చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం జంక్షన్లలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘అరాచక పాలనను అంతమొందించే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనే పోరాటం విశాఖ నుంచే ప్రారంభం కావాలి. అందరం కలిసి పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దోపిడీ రాజ్యం, అరాచకపాలనపై మేధావులు స్పందించి ముందుకురావాలి. అల్లూరి సీతారామరాజులా ఉద్యమించాలి... బొబ్బిలి పులిలా గాండ్రించాలి. ఝూన్సీలక్ష్మీబాయిలా పోరాడాలి’’ అని పిలుపు ఇచ్చారు.

Updated Date - 2021-03-06T15:55:20+05:30 IST