చంద్రబాబు, లోకేశ్‌లు కోలుకోవాలని పూజలు

ABN , First Publish Date - 2022-01-23T06:16:49+05:30 IST

కరోనా బారిన పడిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు త్వరగా కోలుకోవాలని కోరుతూ పాతగాజువాక కుంచుమాంబ ఆలయంలో శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చంద్రబాబు, లోకేశ్‌లు కోలుకోవాలని పూజలు
కుంచుమాంబ ఆలయం వద్ద పూజలు చేస్తున్న టీడీపీ నాయకులు

గాజువాక, జనవరి 22: కరోనా బారిన పడిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు త్వరగా కోలుకోవాలని కోరుతూ పాతగాజువాక కుంచుమాంబ ఆలయంలో శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అసమర్ధ పాలన సాగుతున్నదని ఆరోపించారు. జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ  కరోనా నియంత్రణలో జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు పల్లా శ్రీనివాసరావు, బొండా జగన్‌, మొల్లి ముత్యాలనాయుడు, తెలుగు యువత అధ్యక్షుడు బలగ బాలునాయుడు, టీడీపీ పార్లమెంట్‌ కమిటీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు, నాయకులు నాగేశ్వరరావు, పల్లా రంగా యాదవ్‌, నమ్మి అప్పారావు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-23T06:16:49+05:30 IST