టీడీపీ నేతల అరెస్ట్‌పై చంద్రబాబు ఫైర్

ABN , First Publish Date - 2020-07-08T03:18:04+05:30 IST

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగాడు.

టీడీపీ నేతల అరెస్ట్‌పై చంద్రబాబు ఫైర్

అమరావతి: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగాడు. పేదలకు కట్టిన ఇళ్లు ఇవ్వమనడమే టీడీపీ చేసిన నేరమా? అని ధ్వజమెత్తారు. ఇళ్లు కట్టి 13 నెలలైనా పేదలకు ఇవ్వకపోవడం ప్రభుత్వ తప్పిదం కాదా? అని అన్నారు. కట్టిన ఇళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో చూడటానికి టీడీపీ నేతలు వెళ్లడం నేరామా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధిస్తారా? అని ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను వెంటనే పేదలకు అందజేయాలన్నారు. హౌసింగ్‌లో పెండింగ్‌ బిల్లులను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-08T03:18:04+05:30 IST