ఆ అంశంపై చంద్రబాబు ఎమ్మెల్యేలను మందలించారు: మంత్రి అవంతి

ABN , First Publish Date - 2020-05-28T23:03:27+05:30 IST

ఆ అంశంపై చంద్రబాబు ఎమ్మెల్యేలను మందలించారు: మంత్రి అవంతి

ఆ అంశంపై చంద్రబాబు ఎమ్మెల్యేలను మందలించారు: మంత్రి అవంతి

విశాఖ: ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి అవంతి విమర్శించారు. చంద్రబాబు పాలనలో గ్రాఫిక్స్‌లో అభివృద్ధి చూపించారని, మహానాడు కార్యకర్తలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని మంత్రి మండిపడ్డారు. గొప్పలు చెప్పే చంద్రబాబు.. వెన్నుపోటు గురించి కూడా మాట్లాడాలని అవంతి ఎద్దేవా చేశారు. ఇండస్ట్రీస్‌ గురించి మాట్లాడితే చంద్రబాబు ఎమ్మెల్యేలను మందలించారని, చంద్రబాబు పార్టీకి సీఈవో అనుకుంటారని, లేనిది ఉన్నట్టుగా  చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.

Updated Date - 2020-05-28T23:03:27+05:30 IST