చంద్రబాబు ఆస్తుల కేసు నవంబరు 24కు వాయిదా

ABN , First Publish Date - 2020-10-22T07:45:45+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమోదైన ఆస్తుల కేసు తదుపరి విచారణను ఏసీబీ కోర్టు నవంబరు 24కు

చంద్రబాబు ఆస్తుల కేసు నవంబరు 24కు వాయిదా

హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమోదైన ఆస్తుల కేసు తదుపరి విచారణను ఏసీబీ కోర్టు నవంబరు 24కు వాయిదా వేసింది. చంద్రబాబు ఆస్తులకు సంబంధించి లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో 2005లో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా సుప్రీం ఆదేశాల నేపథ్యంలో స్టే ఎత్తివేతతో విచారణ తిరిగి మొదలైంది. ప్రజాప్రతినిధులపై కేసులను సత్వరమే విచారించాలన్న సుప్రీం తాజా ఆదేశాల నేపథ్యంలో ఈ కేసు బుధవారం విచారణకు వచ్చింది. 


Updated Date - 2020-10-22T07:45:45+05:30 IST