డ్రగ్ మాఫియా మూకల దాడులకు బెదిరే ప్రసక్తే లేదు: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-10-07T00:56:57+05:30 IST

డ్రగ్ మాఫియా మూకల దాడులకు బెదిరే ప్రసక్తే లేదు: చంద్రబాబు

డ్రగ్ మాఫియా మూకల దాడులకు బెదిరే ప్రసక్తే లేదు: చంద్రబాబు

అమరావతి: డ్రగ్ మాఫియా మూకల దాడులకు బెదిరే ప్రసక్తే లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష నేతలపై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టన్నారు. దాడులకు దిగుతుంటే పోలీసు యంత్రాంగం నిద్రపోతోందా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల నిజస్వరూపం బయటపడుతుందనే అక్కసుతోనే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబాన్ టూ తాడేపల్లి లింకులు బయటపెట్టి తీరుతామని స్పష్టం చేశారు. టీడీపీ నేతలకు ఎటువంటి హాని జరిగినా సీఎం, డీజీపీలదే బాధ్యత అని పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-07T00:56:57+05:30 IST