చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2021-10-08T02:56:33+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తూర్పూగోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు.

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తూర్పూగోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. టీడీపీ సరైన పార్టీ అని నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికీ స్వాగతం పలికారు. అలాగే పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఇబ్బందులొచ్చాయని, వైసీపీలో గెలిచి వచ్చిన నాయకుడు నమ్మకంగా ఉంటాడనుకుంటే అలానే పోయాడని పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-08T02:56:33+05:30 IST