చిత్తూరు జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
ABN , First Publish Date - 2020-09-23T01:44:35+05:30 IST
చిత్తూరు జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
అమరావతి: అన్యమతస్థుడైన సీఎం జగన్ డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి? అని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ డిక్లరేషన్ కోసం పట్టుబట్టాలని టీడీపీ నేతలతో చంద్రబాబు చెప్పారు. ఇవాళ చిత్తూరు జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమల ఆలయంలో జగన్ అడుగుపెట్టాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఒంటరిగా పట్టువస్త్రాలిస్తే రాష్ట్రానికే అరిష్టమన్నారు. అన్యమత ఆచారాలను సీఎం జగన్ కించపరచరాదని సూచించారు. రేపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్ల నిరసనలు తెలపాలన్నారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని పేర్కొన్నారు.