సీఎం జగన్ పై చంద్రబాబు కామెంట్స్
ABN , First Publish Date - 2020-07-14T22:20:05+05:30 IST
సీఎం జగన్ పై చంద్రబాబు కామెంట్స్
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును గ్రహించాలని, సింహాచలం బోర్డు, మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మానేయాలని చంద్రబాబు సూచించారు. సంరక్షకులుగా గజపతి కుటుంబ హక్కులను పరిరక్షించాలని, నీతిమాలి రాజకీయాలు జగన్కు తగదని చంద్రబాబు విమర్శించారు.
పద్మనాభస్వామి ఆలయ వ్యవహారాలపై సుప్రీంకోర్టు తీర్పు ఒక మైలురాయి అని చంద్రబాబునాయుడు అన్నారు. ట్రస్టుల నిర్వహణలో రాజకుటుంబాల ముందస్తు ఒప్పందాలు, దీర్ఘాకాల సంప్రదాయాల పవిత్రతను సుప్రీంకోర్టు తీర్పు రక్షించిందని చంద్రబాబు తెలిపారు.