వంగపండు మృతి పట్ల చంద్రబాబు సంతాపం

ABN , First Publish Date - 2020-08-04T15:30:17+05:30 IST

అమరావతి: వంగపండు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. తన సాహిత్యం ద్వారా తెలుగు ప్రజలను జాగృతం చేశారన్నారు.

వంగపండు మృతి పట్ల చంద్రబాబు సంతాపం

అమరావతి: వంగపండు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. తన సాహిత్యం ద్వారా తెలుగు ప్రజలను జాగృతం చేశారన్నారు. తన గొంతుతో, తన పదాలతో అశేష ప్రజానీకాన్ని ఉర్రూతలూగించారని చంద్రబాబు కొనియాడారు. ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేశారన్నారు. వంగపండు సాహిత్యం అనేక భాషల్లోకి అనువదించడం తెలుగు జాతికే గర్వకారణమన్నారు. పీడిత తాడిత ప్రజల హక్కుల సాధన కోసం తన గొంతును, తన సాహిత్యాన్ని అంకితం చేసిన చరితార్ధుడు వంగపండుగా కొనియాడారన్నారు. ఆయన మృతి తెలుగు జానపద సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. వంగపండు అభిమానులకు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని చంద్రబాబు తెలియజేశారు.

Updated Date - 2020-08-04T15:30:17+05:30 IST