పీవీ సింధుకు చంద్రబాబు అభినందనలు
ABN , First Publish Date - 2021-08-02T00:55:33+05:30 IST
టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన పీవీ సింధుకు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు.
హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన పీవీ సింధుకు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. కఠోర శ్రమ, పట్టుధల, అకుంఠిత దీక్షతో విజయం సాధించిందని కొనియాడారు. సింధు గెలుపు దేశానికే గర్వకారణమని, యావత్ దేశం గర్వించ దగ్గ విషయమన్నారు. ఈ తరం క్రీడాకారులకు పీవీ సింధు ఆదర్శంగా నిలుస్తుందని ప్రసంశించారు. సింధు భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్ధాయికి ఎదగాలని, దేశానికి మంచి పేరు తీసుకురావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్లో వరుసగా రెండోసారి పతకం సాధించి రికార్డుకెక్కింది. కోట్లాది మంది భారతీయులు కోరుకున్నట్టే ఒలింపిక్స్లో భారత్కు మరో పతకాన్ని అందించింది. కాంస్య పతకం కోసం కొద్దిసేపటి క్రితం ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హే బింగ్జియావో (చైనా)తో జరిగిన పోరులో వరుస సెట్లలో (21-13, 21-15) విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.