వెంటనే ఆదుకోండి.. ఏపీ సీఎస్‌కు చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2020-09-29T00:42:12+05:30 IST

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో..

వెంటనే ఆదుకోండి.. ఏపీ సీఎస్‌కు చంద్రబాబు లేఖ

అమరావతి: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు లంక గ్రామాలు నీటమునిగాయి. ఈ గ్రామాల్లో కరెంట్ సరఫరా కూడా నిలిచిపోయింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో కొండవీడు వాగు ఉధృతగా ప్రవహిస్తోంది. కరకట్టకు సమీపంలోని పంటలు నీట మునిగిపోయాయి. మత్య్సకారులు వేటకు వెళ్లే ప్రాంతం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందన లేదని ప్రజలు అంటున్నారు. వరద ఉధృతి మరింత పెరిగిందని చెబుతున్నారు. 


ఇక లంక గ్రామాల్లో ప్రజలు పడుతున్న కష్టాలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వరద బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరారు. రైతులకు సాయంపై ప్రభుత్వం నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణ పరిహారం ప్రకటించాలని లేఖలో చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-09-29T00:42:12+05:30 IST