తిక్కారెడ్డికి పోలీసు భద్రత కల్పించాలి: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-12-12T16:58:25+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు.

తిక్కారెడ్డికి పోలీసు భద్రత కల్పించాలి: చంద్రబాబు

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. టీడీపీ నేత తిక్కారెడ్డికి పోలీసు భద్రత కల్పించాలని, వైసీపీ నేతల దౌర్జన్యాలను అరికట్టాలని డీజీపీని కోరారు. జాతరకు వెళ్లిన తిక్కారెడ్డిపై దాడికి పూనుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో మరో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. టీడీపీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నా.. డీజీపీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను.. పరిరక్షించేందుకు డీజీపీ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖ ద్వారా డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-12T16:58:25+05:30 IST