డీజీపీకి చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2021-07-28T02:51:37+05:30 IST

టీడీపీ నాయకుడు దేవినేని ఉమపై జరిగిన దాడిపై డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

డీజీపీకి చంద్రబాబు లేఖ

అమరావతి: టీడీపీ నాయకుడు దేవినేని ఉమపై జరిగిన దాడిపై డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసారు. అక్రమాలను ప్రశ్నించేందుకు వెళ్తే దాడులు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. దాడి జరిగిన తర్వాత గంట సేపు ఎవరూ రాకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో టీడీపీ నేతలు గాయపడ్డారన్నారు. పోలీసులు సకాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.దాడికి పాల్పడిన వారిని  వెంటనే అరెస్ట్‌ చేయాలని  చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉమకు పూర్తి భద్రత కల్పించాలని డీజీపీని చంద్రబాబు కోరారు.  

Updated Date - 2021-07-28T02:51:37+05:30 IST