రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2021-11-05T20:37:37+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని లేఖలో ప్రస్తావించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని లేఖలో ప్రస్తావించారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేశారని, నామినేషన్‌ దాఖలు చేసే కేంద్రం దగ్గరే దాడి జరిగిందని తెలిపారు. 30 మంది వైసీపీ గుండాల దాడిలో వెంకటేశ్‌ తీవ్రంగా గాయపడ్డారని, వెంకటేశ్‌ నామినేషన్‌ పత్రాలు చించివేసి.. ఫోన్‌ లాక్కొన్నారని, దాడికి సంబంధించిన ఫొటోలను లేఖకు చంద్రబాబు జతచేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు భద్రత కల్పించాలని కోరారు. దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్‌ వేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

Updated Date - 2021-11-05T20:37:37+05:30 IST