చంద్రబాబు, లోకేష్ త్వరగా కోలుకోవాలని పూజలు
ABN , First Publish Date - 2022-01-19T04:50:16+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇద్దరూ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మంగళవారం కసుమూరు మస్తాన్ వలీ దర్గాలో పూజలు చేసినట్లు తిరుపతి పార్లమెంటు రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రావూరి రాధాకృష్ణమనాయుడు పేర్కొన్నారు.
వెంకటాచలం, జనవరి 18 : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇద్దరూ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మంగళవారం కసుమూరు మస్తాన్ వలీ దర్గాలో పూజలు చేసినట్లు తిరుపతి పార్లమెంటు రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రావూరి రాధాకృష్ణమనాయుడు పేర్కొన్నారు. కార్యక్రమంలో చల్లా నాగార్జున్రెడ్డి, వలిపి మునుస్వామి, లఘంసాని వెంకయ్యనాయుడు, పఠాన్ ఖయ్యుమ్ ఖాన్, చిన్నబాబు, కడివేటి వెంకయ్య, షేక్ షరీఫ్, సయ్యద్ అన్వర్ తదితరులున్నారు.
విడవలూరు : కొవిడ్ బారిన పడిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్బాబు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మంగళవారం విడవలూరులో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కామాక్షమ్మ దేవాలయంలో చంద్రబాబు, లోకేష్ క్షేమంగా ఉండాలని అర్చనలు, అభిషేకాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెముకుల శ్రీనివాసులు, సత్యవోలు సత్యంరెడ్డి, చలంచర్ల కామేశ్వరమ్మ, సుబ్రహ్మణ్యం, అశోక్ పాల్గొన్నారు.