చంద్రబాబు, లోకేష్ కోలుకోవాలని పూజలు
ABN , First Publish Date - 2022-01-22T03:08:26+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్బాబు కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని శుక్రవారం స్థానిక గంగమ్మ ఆలయంలో టీడీపీ నాయకులు పూజలు నిర్వహించారు.
గూడూరు, జనవరి 21: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్బాబు కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని శుక్రవారం స్థానిక గంగమ్మ ఆలయంలో టీడీపీ నాయకులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సమర్థత చంద్రబాబునాయుడికే ఉందన్నారు. వైసీపీ అసమర్థ పాలనతో ప్రజలు, ఉద్యోగులు అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఆయన అలుపెరగని పోరాటాలు చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికలలో చంద్రబాబును గెలిపించుకో వాల న్నారు. కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, అల్లం వెంకటసాయి, పిళ్లెల శ్రీనివాసులు, చంద్రమౌళి, గురవయ్య, అమరేంద్ర, పల్లి కోటేశ్వర రావు, శివప్రసాద్, సందీప్, కృష్ణయ్య, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.