చంద్రబాబు, లోకేశ్‌ కరోనా నుంచి కోలుకోవాలి

ABN , First Publish Date - 2022-01-22T05:12:41+05:30 IST

చంద్రబాబు, లోకేష్‌, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు.

చంద్రబాబు, లోకేశ్‌  కరోనా నుంచి కోలుకోవాలి
: శివాలయంలో పూజలు నిర్వహిస్తున్న టీడీపీ నేతలు

శివాలయంలో పూజలు, మసీదుల్లో ప్రార్థనలు

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 21 : చంద్రబాబు, లోకేష్‌, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. ఈ మేరకు శుక్రవారం శివాలయంలో టీడీపీ నాయకులు దస్తగిరి, రామ్మోహన్‌, భరత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీఎస్‌ ముక్తియార్‌ నేతృత్వంలో మైనార్టీ నాయకులు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కసిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి రాజే్‌షనాయుడు, షేర్‌ అలీ, కడప పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి మహబూబ్‌హుస్సేన్‌, కార్యదర్శి సిద్దయ్య, టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కుతుబుద్దీన్‌, తెలుగురైతు కార్యదర్శి పద్మనాభరెడ్డి, టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నాయకులు అబ్బు, ప్రతా్‌పరెడ్డి, రాజుపాలెం మండల కన్వీనర్‌ విశ్వనాథరెడ్డి, ప్రొద్దుటూరు మండల కన్వీనర్‌ బాబుల్‌రెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీనారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:12:41+05:30 IST