ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన
ABN , First Publish Date - 2021-10-26T21:08:27+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది.
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. మరికాసేట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ జాప్యంతో చంద్రబాబు హైదరాబాద్ వస్తున్నారు. అమిత్ షా అపాయింట్మెంట్ వచ్చాక మరోసారి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.
నిన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను చంద్రబాబు బృందం కలిసింది. ఏపీలోని పరిణామాలపై ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాను కూడా చంద్రబాబు కలవాలనుకున్నారు. అయితే అపాయింట్మెంట్లు ఖరారు కాకపోవడంతో హైదరాబాద్ వచ్చేస్తున్నారు. వారి అపాయింట్మెంట్లు దొరికాక మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.