డాలర్ శేషాద్రి హఠాన్మరణం బాధాకరం: చంద్రబాబు
ABN , First Publish Date - 2021-11-29T16:06:14+05:30 IST
డాలర్ శేషాద్రి హఠాన్మరణం బాధాకరమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అన్నారు.
అమరావతి: డాలర్ శేషాద్రి హఠాన్మరణం బాధాకరమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉదయాన్నే ఆయన మరణ వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. శేషాద్రి మృతి టీటీడీకి తీరనిలోటన్నారు. డాలర్ శేషాద్రి నిత్యం వేంకటేశ్వర స్వామి సేవలో తరించేవారని, ఆయన టీటీడికి విశేషమైన సేవలందించారని కొనియాడారు. శేషాద్రి తన చివరి క్షణంలోనూ స్వామి వారి సేవకు పాటుపడుతూ కన్నుమూశారన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు.
శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం పాలయ్యారు. గుండెపోటుతో ఆయన మరణించారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖ వెళ్లారు. కాగా.. వేకువజామున గుండెపోటు రావడంతో.. ఆస్పత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2007లో రిటైర్ అయినప్పటికీ శేషాద్రి సేవలు అనివార్యం కావడంతో ఆయనను టీటీడీ తిరిగి ఓఎస్డీగా కొనసాగించింది.