ఎల్లుండి నుంచి చంద్రబాబు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

ABN , First Publish Date - 2021-03-02T22:41:21+05:30 IST

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు

ఎల్లుండి నుంచి చంద్రబాబు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

అమరావతి: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఎల్లుండి నుంచి చంద్రబాబు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 4 నుంచి 8 వరకు 5 రోజుల పాటు చంద్రబాబు పలు జల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు, చిత్తూరు, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తారు. 

 

ఈ నెల 4న కర్నూలు జిల్లాలో, 5న చిత్తూరు జిల్లాలో,  6న విశాఖ జిల్లాలో, 7న విజయవాడలో, 8న గుంటూరు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తారు.

Updated Date - 2021-03-02T22:41:21+05:30 IST