చంద్రబాబుకు ఘనస్వాగతం

ABN , First Publish Date - 2021-03-05T05:11:16+05:30 IST

హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వెళ్తున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు

చంద్రబాబుకు ఘనస్వాగతం
చంద్రబాబుతో టీడీపీ నాయకులు

షాద్‌నగర్‌రూరల్‌ : హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వెళ్తున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు రంగారెడ్డిజిల్లా షాద్‌నగర్‌లో పార్టీ శ్రేణులు గురువారం ఘనస్వాగతం పలికారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో చటాన్‌పల్లి బైపాస్‌ చౌరస్తాలో ఆగిన చంద్రబాబును శాలువాలతో సన్మానించారు. బాబు కాన్వాయ్‌ ఆగగానే కార్యకర్తలు జై చంద్రబాబు.. జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. బాబుకు స్వాగతం పలికిన వారిలో మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు లింగారం కుమార్‌గౌడ్‌, బాల్‌రెడ్డి, రమేష్‌, అంజయ్య, భాస్కర్‌రెడ్డి, యాదయ్యగౌడ్‌, రాజశేఖర్‌రెడ్డి, వెంకటయ్య, సుందరయ్య, కుమార్‌, గణే్‌షగౌడ్‌, నర్సింహులు ఉన్నారు.


జేబుదొంగల చేతివాటం

చంద్రబాబుకు స్వాగతం చెప్పే సందడిలో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. నాయకులు హడావిడిలో ఉండగా వారి జేబుల్లో నుంచి డబ్బులు దొంగిలించారు. లింగారం కుమార్‌గౌడ్‌ జేబులో నుంచి రూ.4,500, మరొకరి నుంచి రూ.5,500, ఇంకొకరి నుంచి రూ.3,500 దొంగిలించారు. బాబు వెళ్లిన తర్వాత జేబులు చూసుకున్న నాయకులు డబ్బులు మాయం కావడంతో విస్తుపోయారు.



Updated Date - 2021-03-05T05:11:16+05:30 IST