PV Sindhu కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్
ABN , First Publish Date - 2021-08-02T03:06:46+05:30 IST
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో పీవీ సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ : ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో పీవీ సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్లో వరుసగా రెండోసారి పతకం సాధించి రికార్డుకెక్కింది. సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. కొద్దిసేపటి క్రితం పీవీ సింధుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. యావత్ క్రీడాలోకానికి స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. సింధూపోరాట పటిమ దేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఒలంపిక్స్లో వరుసగా రెండుమార్లు పతకాలు సాధించిన సింధు దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేశారని సింధును కొనియాడారు. సింధూ సాధించిన విజయం యావత్ భారతదేశానికే కాకుండా ప్రత్యేకించి తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలన్న ఆకాంక్షను ఫోన్లో చంద్రబాబు వ్యక్తం చేశారు. కాగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పీవీ సింధును అభినందించారు.
ఇవి కూడా చదవండి
కాంస్య పోరులో అదరగొట్టిన సింధు.. భారత్కు మరో పతకంరియో రజతం కంటే టోక్యో కాంస్యమే గొప్ప: పీవీ సింధుTokyo Olympics: సెమీస్కు చేరిన టీమిండియావరుసగా రెండోసారి.. చరిత్ర సృష్టించిన సింధుమ్యాచ్కు మునుపు సింధుతో తండ్రి అన్న మాటలివే!PV Sindhuకు అభినందనల వెల్లువ