ఎస్ఈసీ నీలం సాహ్నీకి చంద్రబాబు ఫోన్
ABN , First Publish Date - 2021-11-09T02:45:06+05:30 IST
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీతో ఫోన్లో టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీతో ఫోన్లో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. నెల్లూరు, కుప్పం, దర్శి స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఎస్ఈసీకి చంద్రబాబు వివరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు కోరారు. సకాలంలో అభ్యర్థుల తుది జాబితా ప్రకటించకుండా ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరిస్తున్నారని ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేసారు. అభ్యర్థుల తుది జాబితా ప్రకటించని చోట తక్షణమే ఎన్నికల ప్రక్రియను నిలిపివేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు.