నెల్లూరులో రేపు చంద్రబాబు పర్యటన
ABN , First Publish Date - 2021-11-25T01:02:02+05:30 IST
నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం పరిశీలించనున్నారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నెల్లూరు చేరుకుని ఇందుకూరుపేట, కోవూరు, నెల్లూరు సిటీ పరిధిలోని భగత్సింగ్ కాలనీ, గాంధీగిరిజన కాలనీ, జనార్ధనరెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గాన గుంటూరు బయలుదేరి వెళతారు.