రేపటినుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన
ABN , First Publish Date - 2021-10-27T07:02:48+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైనట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ మంగళవారం తెలిపారు.
కుప్పం రూరల్, అక్టోబరు 26 : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైనట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ మంగళవారం తెలిపారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు చెప్పారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన 28న నేరుగా బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన కుప్పానికి చేరుకుంటారని చెప్పారు. అదే రోజు కుప్పం బస్టాండు వద్ద జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. ఆయన తన పర్యటనలో ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు టీడీపీ బలోపేతంపై పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నట్లు వివరించారు.