చంద్రబాబు పర్యటించబోయే ప్రాంతాల్లో హడావుడిగా నిత్యావసరాల పంపిణీ
ABN , First Publish Date - 2021-11-25T17:28:55+05:30 IST
మాజీ సీఎం చంద్రబాబు పర్యటించబోయే ప్రాంతాల్లో హడావుడిగా నిత్యవసరాలు, రూ.2వేలు పరిహారాన్ని అధికార పార్టీ పంపిణీ చేసింది.
నెల్లూరు : మాజీ సీఎం చంద్రబాబు పర్యటించబోయే ప్రాంతాల్లో హడావుడిగా నిత్యవసరాలు, రూ.2వేలు పరిహారాన్ని అధికార పార్టీ పంపిణీ చేసింది. పరిహారం పంపిణీలోనూ పార్టీల వివక్షత చూపించడం గమనార్హం. ఇతర పార్టీల వారికి పరిహారం సక్రమంగా అందలేదు. వరదల్లో ఆధార్, రేషన్ కార్డులు పోయిన వారికి పరిహారం, నిత్యవసరాలు అందలేదని తెలుస్తోంది. రూ.లక్షలు నష్టపోతే రూ.2వేలు ఎందుకని కొందరు నిరాకరించారు. చంద్రబాబు పర్యటన ప్రాంతాల్లో హడావిడిగా పారిశుద్ద్య పనులు చేపట్టారు.