చంద్రబాబు కోలుకోవాలని పూజలు
ABN , First Publish Date - 2022-01-19T07:07:29+05:30 IST
కరోనా నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు త్వరగా కోలుకోవాలంటూ ఎన్ఎస్ఎఫ్, తెలుగుయువత నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.
ధర్మవరం, జనవరి 18: కరోనా నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు, నారా లోకేష్, మాజీమంత్రి పరిటాల సునీత, నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్లు త్వరగా కోలుకోవాలంటూ పాండురంగ స్వామిదేవాలయంలో టీఎన్ఎస్ఎఫ్, తెలుగుయువత నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను వారు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం స్థానిక పాండురంగస్వామి దేవాలయం లో పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ పార్లమెం ట్ ఆర్గనైజిం గ్ సెక్రటరీ ఇర్షాదఖ్, తెలుగుయువత పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుమలేశ్, ఎన్బీకే హరి, ఇమ్రాన్, బిల్లేరామక్రిష్ణ, వినోద్లు పాల్గొన్నారు.
ధర్మవరంరూరల్: కరోనా నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్, నియోజకవర్గ ఇన్చార్జి పరిటాలశ్రీరామ్లు కోలుకోవాలని నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు పైటే మధుసూదన్ ఆధ్వర్యంలో మంగళవారం పోతుకుంటలోని ఆల యాల్లో పూజలు చేశారు. ఆంజనేయస్వామి, మారెమ్మకు ఆకుపూజ కట్టించారు. 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోతుకుంట రవి, గ్రామకమిటీ అధ్యక్షు డు నరసింహులు, ఉపాధ్యక్షుడు వీర, రామకృష్ణ, ఓబిలేసు, సన్న, మోహన్, ఓబిలేసు, ఆంజి, ప్రభాకర్, ప్రకాష్, జన తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ: కరోనా నుంచి చంద్రబాబునాయుడు, నారాలోకేష్, పరిటాల శ్రీరామ్లు త్వరగా కోలుకోవాలని టీడీపీ నాయకులు సూర్యచంద్ర అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేయించారు. ఈ సందర్భంగా 108 టెంకాయలు కొట్టి అనంతరం ప్రత్యేక పూజలు చేయించారు.