ధన దాహంతో శ్రీవారి ఆస్తులను కొట్టేయాలని వైసీపీ చూడటం నీచం: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-05-27T23:10:58+05:30 IST

ధన దాహంతో శ్రీవారి ఆస్తులను కొట్టేయాలని వైసీపీ చూడటం నీచం: చంద్రబాబు

ధన దాహంతో శ్రీవారి ఆస్తులను కొట్టేయాలని వైసీపీ చూడటం నీచం: చంద్రబాబు

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. ధన దాహంతో శ్రీవారి ఆస్తులను కొట్టేయాలని వైసీపీ చూడటం నీచమని చంద్రబాబు అన్నారు. తిరుమలకు ఏడుకొండలు ఎందుకని వైఎస్ అన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించామని, పింక్ డైమండ్ విషయంలో మాపై అసత్య ప్రచారం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. తిరుమల పవిత్రతను అపవిత్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, పవిత్రమైన శ్రీవారి లడ్డూని బల్క్ గా విక్రయించడమేంటి? అని ప్రశ్నించారు. విలువైన శ్రీవారి ఆస్తులను కారుచౌకగా కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలంలో భూముల కబ్జా చేశారని, తిరుమల పుణ్యక్షేత్రమని వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని, వెంకటేశ్వర స్వామి ఆస్తులను కాపాడుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని తీసుకొచ్చారని, తిరుమల ప్రాశస్త్రాన్ని కాపాడుకుందామని, మేము ఏనాడు అధికార దుర్వినియోగం చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-27T23:10:58+05:30 IST