ఊమన్ చాందీ, ఏఐసీసీ ప్రదాన కార్యదర్శి వేణుగోపాల్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్

ABN , First Publish Date - 2021-08-17T18:46:07+05:30 IST

మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్..

ఊమన్ చాందీ, ఏఐసీసీ ప్రదాన కార్యదర్శి వేణుగోపాల్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్

కొచ్చి: మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కేరళ మాజీ మఖ్యమంత్రి ఊమన్ చాందీ, కాంగ్రెస్ ఎంపీలు అదూర్ ప్రకాష్, హిబి ఎడిన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏపీ అనిల్‌ కుమార్‌పై సీబీఐ మంగళవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సోలార్ కుంభకోణం కేసుకు సంబంధించి ఈ వేధింపులకు పాల్పడ్డారనే సీబీఐ ఆరోపిస్తోంది. బీజీపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఏపీ అబ్దుల్‌కుట్టీ పేరు కూడా ఎఫ్ఐఆర్‌లో ఉంది. తిరువనంతపురం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు సీబీఐ మంగళవారంనాడు ఈ ఎఫ్ఐఆర్ సమర్పించింది. ఈ కేసును సీబీఐ తిరువనంతపురం విభాగం దర్యాప్తు చేస్తోంది. ఈ కేసును అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. పోలీసు ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం మహిళా పారిశ్రామికవేత్తపై జరిగిన ఈ వేధింపులన్నీ మంత్రుల అధికార నివాసాలు, ఎమ్మెల్యే హోస్టళ్లు, హోటల్ రూమ్‌లలో జరిగాయి. 2018లో వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Updated Date - 2021-08-17T18:46:07+05:30 IST