జాతీయ రహదారి డిజైన్‌ మార్చాలి

ABN , First Publish Date - 2021-01-21T06:30:53+05:30 IST

రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మించే జాతీయ రహదారి డిజైన్‌ మార్చాలని డిమాండు చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గిరిజనులు బుధవారం ధర్నా చేశారు

జాతీయ రహదారి డిజైన్‌ మార్చాలి
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న గిరిజనులు

గిరిజన సంఘం డిమాండ్‌


అరకులోయ టౌన్‌, జనవరి 20: రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మించే జాతీయ రహదారి డిజైన్‌ మార్చాలని డిమాండు చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గిరిజనులు బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకుడు కె.సురేంద్ర మాట్లాడుతూ, గిరిజనుల పంట భూములు, ఆవాసాల మీదుగా రహదారి నిర్మాణం చేపడితే ఊరుకోబోమన్నారు. భూముల సర్వేను  అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామారావు, రామన్నతోపాటు లిట్టిగుడ, రవ్వలగుడ, ఆర్‌.డుంబ్రిగుడ గ్రామాలకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T06:30:53+05:30 IST