జాతీయ రహదారి డిజైన్ మార్చాలి
ABN , First Publish Date - 2021-01-21T06:30:53+05:30 IST
రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మించే జాతీయ రహదారి డిజైన్ మార్చాలని డిమాండు చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజనులు బుధవారం ధర్నా చేశారు
గిరిజన సంఘం డిమాండ్
అరకులోయ టౌన్, జనవరి 20: రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మించే జాతీయ రహదారి డిజైన్ మార్చాలని డిమాండు చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజనులు బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకుడు కె.సురేంద్ర మాట్లాడుతూ, గిరిజనుల పంట భూములు, ఆవాసాల మీదుగా రహదారి నిర్మాణం చేపడితే ఊరుకోబోమన్నారు. భూముల సర్వేను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామారావు, రామన్నతోపాటు లిట్టిగుడ, రవ్వలగుడ, ఆర్.డుంబ్రిగుడ గ్రామాలకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు.