వరసిద్ధుడి దర్శన వేళల్లో మార్పు
ABN , First Publish Date - 2021-05-14T06:02:01+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా కాణిపాకంలోని వరసిద్ధుడి ఆలయ దర్శన వేళల్లో మార్పు చేస్తున్నట్లు ఈవో వెంకటేశు తెలిపారు.
ఐరాల(కాణిపాకం), మే 13: కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా కాణిపాకంలోని వరసిద్ధుడి ఆలయ దర్శన వేళల్లో మార్పు చేస్తున్నట్లు ఈవో వెంకటేశు తెలిపారు. ఉదయం ఏడు నుంచి 10 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే 10 గంటల తర్వాత నిర్వహించే త్రికాల పూజలు, మహా హారతిని ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. ఆలయానికి రాలేని భక్తుల సౌకర్యార్థం నిర్వహించే పరోక్ష సేవల్లో భాగంగా ఉదయం తొమ్మిది గంటలకు ప్రత్యేక అభిషేకం, 10 గంటలకు గణపతి హోమం, 11 గంటలకు కల్యాణోత్సవం జరుగుతుందన్నారు. పరోక్ష సేవల కోసం భక్తులు.. ఎస్బీఐ, కాణిపాకంలోని ఖాతా నెంబరు 30160990250, ఐఎఫ్ఎస్ కోడ్ ఎస్బీఐఎన్ 0010105 ద్వారా ఆన్లైన్లో నగదు జమ చేస్తే.. వారి గోత్ర నామాలతో పూజలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చన్నారు.