శ్రీవారి ఆలయ ఆలంకరణ మార్పు

ABN , First Publish Date - 2022-01-19T07:00:05+05:30 IST

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి ఏర్పాటు చేసిన పుష్పాలంకరణను మంగళవారం మార్చారు.

శ్రీవారి ఆలయ ఆలంకరణ మార్పు
నూతన అలంకరణలో శ్రీవారి ఆలయం

తిరుమల, జనవరి18 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి ఏర్పాటు చేసిన పుష్పాలంకరణను మంగళవారం మార్చారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా 13 నుంచి 22వ తేదీ వరకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను చేయించాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏకాదశి సందర్భంగా గురువారం చేసిన పుష్పాలు వాడిపోవడంతో మంగళవారం తిరిగి నూతన అలంకరణలు చేశారు. మహద్వార గోపురానికి శ్రీమహావిష్ణువు, శంఖుచక్రనామాల బోర్డుతో పాటు పూలమాలను అలంకరించారు. ఆలయంలోనూ నూతన పుష్పాలతో అలంకరణలు చేశారు. ఈ పుష్పాలు కూడా వాడిపోయిన తర్వాత మరోసారి పుష్పాలంకరణ చేసేలా టీటీడీ ప్రణాళిక రూపొందించుకుంది. 

Updated Date - 2022-01-19T07:00:05+05:30 IST