లాక్డౌన్ వేళల్లో మార్పులు
ABN , First Publish Date - 2020-07-08T10:29:34+05:30 IST
అమలాపురంలో లాక్డౌన్ వేళల్లో ఆర్డీవో బీహెచ్.భవానీశంకర్ మార్పులు చేశారు.
అమలాపురం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): అమలాపురంలో లాక్డౌన్ వేళల్లో ఆర్డీవో బీహెచ్.భవానీశంకర్ మార్పులు చేశారు. బుధవారం నుంచి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు తెరవాలన్నారు. మందుల షాపులు, పాలు, డెయిరీలు 24గంటలు తెరిచి ఉంటాయన్నారు. కరోనా నియంత్రణకు అందరూ సహకరించాలని ఆర్డీవో విజ్ఞప్తి చేశారు. ది అసోసియేషన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అత్యవసర సమావేశం కల్వకొలను తాతాజీ అధ్యక్షతన నిర్వహించి మధ్యా హ్నం 2 గంటల వరకు షాపులు తెరవాలని నిర్ణయించారు. అనంతరం ఆర్డీవోను కలిసి వినతిపత్రం అందించారు.